మరో కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే..! 8 లైన్లతో ఆ రూట్లోనే.. రూ.2,606 కోట్లతో..!
Thu May 08, 2025 15:07 Politics
తెలంగాణలోని పలు మార్గాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవేలు నిర్మిస్తుండగా.. మరో కొత్త జాతీయ రహదారి నిర్మించున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇది.. భద్రాద్రి రామయ్య క్షేత్రానికి చేరుకునే భక్తులకు ఆ ప్రాంత ప్రజలకు శుభవార్తే. ఖమ్మం జిల్లాలోని తల్లాడ నుంచి భద్రాచలం వరకు 8 లైన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 2,606 కోట్లు కేటాయించగా.. నిర్మాణ పనులు త్వరలోనే వేగంగా ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. జాతీయ రహదారి నిర్మాణ నిబంధనల ప్రకారం.. రహదారికి ఇరువైపులా ఉన్న గృహ సముదాయాలు, భవనాలు, దుకాణాలను గుర్తించి.. వాటి తొలగింపునకు సంబంధించిన సమగ్ర సర్వే నివేదికలను త్వరితగతిన ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ రహదారిని రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ 8 లైన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ఖమ్మం జిల్లాలోని తల్లాడ నుంచి ప్రారంభమై.. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం మీదుగా ములుగు, భూపాలపల్లి జిల్లాలను కలుపుకుంటూ వెళ్లనుంది. తద్వారా ఈ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా భద్రాద్రికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రహదారి నిర్మాణం కేవలం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి కూడా గణనీయంగా దోహదపడుతుంది. పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో పర్యటించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని ప్రధాన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుల వివరాలివిగో..
ఇండోర్–హైదరాబాద్ ఎక్స్ప్రెస్వే..
రూ. 17,000 కోట్ల వ్యయంతో 770 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో 136 కిలోమీటర్లు తెలంగాణ గుండా వెళుతుంది. రూ.4,500 కోట్ల విలువైన పనులకు పూర్తి అనుమతులు లభించాయి. ఈ మార్గం కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల మీదుగా వెళుతుంది. మార్చి 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా ఇండోర్, హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం 20 గంటల నుంచి 10 గంటలకు తగ్గుతుంది.
సూరత్- చెన్నై ఎక్స్ప్రెస్వే..
1,100 కిలోమీటర్ల ఈ ఎక్స్ప్రెస్వే తెలంగాణ గుండా వెళుతుంది. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలుపుతుంది. తెలంగాణలోని విభాగం, పొరుగున ఉన్న కర్నూలు ప్రాంతంతో సహా 78 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రయాణ సమయం 28 గంటల నుండి 17 గంటలకు, దూరం 300 కిలోమీటర్లు తగ్గుతుంది.
#andhrapravasi #GreenfieldHighway #InfrastructureBoost #8LaneExpressway #HighwayDevelopment #IndiaInfra
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.